ఈ శతాబ్దిలోకెల్లా అత్యంత సుదీర్ఘ కాలంపాటు సంభవించే సూర్యగ్రహణం
ఈ రోజు ఏర్పడనుంది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ లో ప్రారంభం అయ్యే ఈ గ్రహణం
కెమరూన్, కాంగో, ఉగాండాల మీదుగా ప్రయాణించి నైరోబి, కెన్యాలను
దాటుకొని హిందూమహాసముద్రం మీదకు ప్రవేశించును. అక్కడ ఉన్న
మాల్దీవులలో అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది.
ఇక్కడ ౧౦ని. ౮సె. పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగుతుందని
పరిశోధకులు వెల్లడించారు.
భారతీయ కాలమాన ప్రకారం ఉదయం ౧౧ గం. ౧౭ ని. మొదలై
మధ్యాహ్నం ౩ గం. ౪౭ ని. లకు ఈ గ్రహణం అంతమవుతుంది.
మధ్యాహ్నం ౧ గం. ౨౦ ని. లకు తిరువనంతపురం లో
ఈ సూర్యాగ్రహణం భారత భూభాగంలో ప్రవేశిస్తుంది. ౧౦ని. ౪సె.
పాటు ప్రయాణించి రామేశ్వరం వద్ద భారత భూభాగానికి
వీడ్కోలు చెబుతుంది. సూర్యగ్రహణం యొక్క మధ్య రేఖ
భారత భూభాగంపై తమిళనాడు లోని ధనుష్కోటి
మీదుగా పోవును.
క్రీ.శ.౧౯౯౨ జనవరి ౪వ తేదీన ఏర్పడిన ౧౧ని.౪౧సె.
(ఇదే ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం)
సూర్యగ్రహణం నుంచి, క్రీ.శ. ౩౦౪౩, డిసెంబర్ ౨౩న
ఏర్పడబోయే ౧౧ ని. ౭.౭ సె. సూర్యగ్రహణం వరకు,
ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణమే
అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం.
ఈ రోజు ఏర్పడనుంది. మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ లో ప్రారంభం అయ్యే ఈ గ్రహణం
కెమరూన్, కాంగో, ఉగాండాల మీదుగా ప్రయాణించి నైరోబి, కెన్యాలను
దాటుకొని హిందూమహాసముద్రం మీదకు ప్రవేశించును. అక్కడ ఉన్న
మాల్దీవులలో అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది.
ఇక్కడ ౧౦ని. ౮సె. పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగుతుందని
పరిశోధకులు వెల్లడించారు.
భారతీయ కాలమాన ప్రకారం ఉదయం ౧౧ గం. ౧౭ ని. మొదలై
మధ్యాహ్నం ౩ గం. ౪౭ ని. లకు ఈ గ్రహణం అంతమవుతుంది.
మధ్యాహ్నం ౧ గం. ౨౦ ని. లకు తిరువనంతపురం లో
ఈ సూర్యాగ్రహణం భారత భూభాగంలో ప్రవేశిస్తుంది. ౧౦ని. ౪సె.
పాటు ప్రయాణించి రామేశ్వరం వద్ద భారత భూభాగానికి
వీడ్కోలు చెబుతుంది. సూర్యగ్రహణం యొక్క మధ్య రేఖ
భారత భూభాగంపై తమిళనాడు లోని ధనుష్కోటి
మీదుగా పోవును.
క్రీ.శ.౧౯౯౨ జనవరి ౪వ తేదీన ఏర్పడిన ౧౧ని.౪౧సె.
(ఇదే ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘ సూర్యగ్రహణం)
సూర్యగ్రహణం నుంచి, క్రీ.శ. ౩౦౪౩, డిసెంబర్ ౨౩న
ఏర్పడబోయే ౧౧ ని. ౭.౭ సె. సూర్యగ్రహణం వరకు,
ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణమే
అత్యంత సుదీర్ఘ కాల సూర్యగ్రహణం.